టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. విశాఖ జిల్లా వీఎంఆర్డీఏ కార్యాలయంలో మంగళవారం మంత్రి బొత్స అధికారులతో సమావేశం నిర్వహించారు. విశాఖలో సీఎం జగన్మోహన్రెడ్డి పర్యటన, వార్డుల విభజన, విశాఖ ఉత్సవ్ ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడికి అభివృద్ధి గురించి ఏం తెలుసని.. అయిదేళ్ల పాలనలో సమావేశాల నిర్వహణ మినహా మరో పని చేయలేదని విమర్శించారు.
జీవీఎంసీ ఎన్నికలకు సంబంధించి అడ్డంకులన్నీ తొలగిపోయాయని, త్వరలోనే స్థానిక ఎన్నికలు జరగనున్నట్లు వెల్లడించారు. మూలకొద్దు గ్రామం సమస్య కూడా త్వరలోనే పరిష్కరిస్తామని, కన్సల్టెన్సీలు రిపోర్టులను చదివి అభివృద్ధి అని చంద్రబాబు నాయుడు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. విశాఖలో ఐటీ కంపెనీలు అభివృద్ధి కూడా వైఎస్ పాలనలో జరిగిందని మంత్రి స్పష్టం చేశారు.