telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఐటీ ఉచ్చులో అనురాగ్, తాప్సి…

ఐటీ దాడులు నిన్న బాలీవుడ్‌ తారలపై జరిగిన విషయం తెలిసిందే. ఫాంటమ్ ఫిలిం ప్రొడక్సన్ కంపెనీ కేసు పరంగా చేసిన ఈ దాడుల్లో ఐటీ వారు భారీ మొత్తంలో లెక్కలు తారుమారు అయినట్లు గుర్తించారు. ఐటీ వారు ఈ తనిఖీలను అనురాగ్ కశ్యప్, తాప్సీ తదితరుల ఆస్తులపై నిర్మిహించారు. ఈ నేపథ్యంలో ఫాంటమ్ ఫిలిం ప్రొడక్షన్‌లో చేసిన సినిమాల లెక్కలన్నింటినీ సరిచూడగా దాదాపు రూ.650 కోట్లకు సంబంధించిన లెక్కలు తారుమారయ్యాయని అధికారులు తెలిపారు. ఫాంటమ్ ఫిలిం కంపెనీ స్టాఫ్ రూ.300 కోట్ల లెక్కలు చెప్పలేక పోతున్నారని, అంతేకాకుండా మరో రూ.350 కోట్ల టాక్స్‌లను చెల్లించలేదని చెప్పారు. వీటితో పాటుగా నటి ఇంట్లో రూ.5 కోట్లు లెక్కలేని ధనాన్ని స్వాధీనం చేసుకున్నారని, ఇంకా విచారణ, తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. అయితే ఫాంటమ్ ఫిలిం కంపెనీపై ఉన్న టాక్స్ కేసు నిమిత్తం ముంబై, పూణెలలో దాదాపు 28 చోట్ల ఐటీ దాడులు జరిగాయి. ప్రభుత్వ విచారణ ప్రకారం రిలియన్స్, క్వాన్ సంస్థలపైన కూడా ఈ తనిఖీలు నిర్వహించారు. వారి వద్ద నుంచి ఏడు బ్యాంక్ లాకర్స్‌ను స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts