తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విరుచుకుపడ్డారు. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నీకు చేతనైతే పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తో కొట్లాడి కృష్ణా జలాల నీటి చౌర్యం ఆపాలి అంటూ సవాల్ విసిరారు.
స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్ బలిచేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇలాంటి నేతల పట్ల ప్రజలు ఆప్రమత్తంగా ఉండాలని అన్నారు. రైతుల సంక్షమానికి విఘాతం కలిగించే వ్యవసాయ బిల్లుల విషయంలో రాష్ట్ర సర్కారు అసెంబ్లీలో ఎందుకు వ్యతిరేక తీర్మానం చేయలేదని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్రం స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో తన బాధ్యత నుంచి తప్పుకుంటే, రాష్ట్ర సర్కారు నియంత్రిత వ్యవసాయం పేరుతో చేతులెత్తేసిందని దుయ్యబట్టారు.
పుచ్చిపోయిన పన్నుకి సింగపూర్ వెళ్లమని ఎవరు చెప్పారు?: యనమలపై రోజా ట్వీట్