telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ పోలీసుల నిర్ణయం హర్షించదగింది: ఏపీ మంత్రి

vanitha tatineni minister

దేశవ్యాప్తంగా సంచలనం రెప్పిన దిశ కేసు నిందితులను ఈ రోజు తెల్లవారుజామున ఎన్‌కౌంటర్‌ చేయడంపై ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసులు తీసుకున్న నిర్ణయం హర్షించదగిందన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు నేడే అసలైన దీపావళి అని పేర్కొన్నారు. నిర్భయ ఘటన తర్వాత పోక్సో చట్టం ప్రవేశపెట్టినా అది సరిగా అమలు కాకపోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి.

నిర్భయ నిందితుడు ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు. ఇలాంటి నిందితులకు మరణశిక్ష విధించాలని దేశం ముక్తకంఠంతో నినదిస్తోంది. దిశ కేసులో లాయర్లు కూడా నిందితుల తరపున వాదించడానికి ముందుకు రాలేదు. ఎట్టకేలకు ఎన్‌కౌంటర్‌తో నిందితులు మరణించారు. దీనివల్ల చనిపోయిన దిశను తీసుకురాలేకపోయినా బాధితురాలి తల్లిదండ్రులకు కాస్తైనా ఊరట లభించిందన్నారు.

Related posts