ఇటీవల ట్రాన్స్ టాయ్ కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుల పై మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు స్పందించారు. ఈ కేసులతో తనకు సంబంధం లేదని అన్నారు. నేను ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ ప్రారంభించినప్పటికీ బాధ్యతలను సీఈవో చెరుకూరి శ్రీధరే చూసేవారని చెప్పారు.
కంపెనీని స్థాపించిన తర్వాత 14 బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నుంచి తప్పించడంతో ట్రాన్స్ ట్రాయ్ కు భారీ నష్టం వాటిల్లిందని చెప్పారు. కంపెనీ బ్యాలెన్స్ షీట్లపై మాత్రమే తాను సంతకం చేశానని స్పష్టం చేశారు. సంస్థ రోజువారీ కార్యకలాపాలతో తనకు సంబంధం లేదని అన్నారు. . సీబీఐ, యూనియన్ బ్యాంకులు తనపై తప్పుడు కేసులు పెట్టాయని రాయపాటి ఆరోపించారు.
దేశ వ్యాప్తంగా హింస పెరిగిపోతోంది: రాహుల్