telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2020 : సన్ రైజర్స్ కు షాక్ ఇచ్చిన చెన్నై…

ఐపీఎల్ 2020 లో ఈ రోజు దుబాయ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో టాస్ గెలిచిన చెన్నై బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై షేన్ వాట్సన్ (42), అంబటి రాయుడు(41) రాణించడంతో నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.ఇక సన్‌రైజర్స్ బౌలర్లలో సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, టి నటరాజన్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఆ తర్వాత 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన సన్ రైజర్స్ శుభారంభాని దక్కించుకుంది. ఈ క్రమంలో కేన్ విలియమ్సన్ (57) అర్ధశతకంతో రాణించాడు. కానీ చెన్నై బౌలర్ శార్దుల్ ఠాకూర్ హైదరాబాద్ ను గట్టు దెబ్బ తీసాడు. సన్ రైజర్స్ విజయానికి చివరి రెండు ఓవర్లలో 26 పరుగులు కావాల్సిన సమయంలో 19 వ ఓవర్ వేసిన ఠాకూర్ కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక ఆ తర్వాత చివరి ఓవర్లో బ్రావో కేవలం ఒక పరుగు మాత్రమే ఇవ్వడంతో చెన్నై 20 పరుగుల తేడాడో ఐపీఎల్ 2020 లో తమ మూడో విజయం సాధించింది. ఇక ఈ విజయంతో చెన్నై పాయింట్ల పట్టికలో 7 స్థానం నుండి ఆరో స్థానానికి రాగ సన్ రైజర్స్ఓటమి తర్వాత కూడా తన 5 స్థానాన్ని కాపాడుగోగలిగింది.

Related posts