telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇప్పటి వరకు 31 బస్సులు సీజ్ చేశారు: జేసీ దివాకర్ రెడ్డి

jc-diwakar-reddy

సీఎం  జగన్ కు మా బస్సులే కనిపిస్తున్నాయని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నో ట్రావెల్స్ బస్సులున్నప్పటికీ, తమ బస్సులను మాత్రమే బూతద్దంలో చూస్తూ సీజ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటి వరకు 31 బస్సులు సీజ్ చేశారని చెప్పారు. 70 ఏళ్ల నుంచి ట్రావెల్స్ రంగంలో ఉన్నామని చెప్పారు.

చిన్నచిన్న పొరపాట్లు ఆర్టీసీ సహా ఏ ట్రావెల్స్ కైనా సహజమేనని చెప్పారు. ఫైన్ లతో పోయేదానికి సీజ్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఈ విషయంపై కోర్టుకు వెళతామని చెప్పారు. జగన్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ తమ అబ్బాయేనని అన్నారు.జగన్ పాలనకు 100 మార్కులకు గాను 150 మార్కులు వేయాలని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. అయితే, పాలనలో మాత్రం కింద, మీద పడుతున్నారని అన్నారు.

Related posts