telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

న్యూఢిల్లీ : .. రంగంలోకి దిగుతున్న సోనియా.. పాదయాత్రకు ముహూర్తం ఖరారు..

sonia and priyanka gandhi in raebareli

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ దేశంలో ఎన్నడూ లేనంతగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాటమే మార్గమని ఆమె తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు అక్టోబర్‌ 2న పాదయాత్ర నిర్వహిస్తామని చెప్పారు. ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్మించడమే పార్టీ అజెండాగా మారాలన్నారు.

2019 ప్రజాతీర్పును బీజేపీ దుర్వినియోగం చేస్తోందని, ఆర్థిక మందగమనం, ఉద్యోగాల కోత రోజురోజుకూ పెరుగుతోందని మండిపడ్డారు. పెట్టుబడిదారులకు భరోసా కల్పించే వాతావరణం నెలకొల్పాలని సోనియా సూచించారు.

Related posts