ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తాయని బీజేపీ నేత పురందేశ్వరి అన్నారు. విజయవాడలో ఇరుపార్టీల నేతలు సమావేశమయ్యారు. సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టోపై ప్రధానంగా చర్చ జరిగింది. అనంతరం, మీడియాతో పురందేశ్వరి మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో, సమన్వయ కమిటీలతో ముందుకెళ్తామని చెప్పారు. తమ కూటమిని ప్రజలు ఆశీర్వదిస్తారని భావిస్తున్నానని అన్నారు.
ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకే ఆబరాగా ఎన్నికలు నిర్వహిస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై ఆమె విమర్శలు గుప్పించారు.వాలంటీర్ వ్యవస్థను పెట్టుకుని వైసీపీ ఎన్నికలకు వెళ్తోందని, ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. ఉమ్మడి ప్రణాళికలతో ప్రజలకు మేలు జరిగేలా ముందుకెళ్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఆదినారాయణ రెడ్డి, జనసేన పార్టీ నుంచి నాదెండ్ల మనోహర్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ కార్మికుల విషయంలో కేసీఆర్ యూటర్న్: షబ్బీర్ అలీ