ఏపీలో వైసీపీ ప్రభుత్వ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరి అన్నారు. జగన్ తన అజెండా ప్రకారం నడుచుకుంటే బాగుంటుంది తప్ప, కక్షా రాజకీయాలు అనవసరమని సూచించారు. ఒక రాజధాని ఉంటేనే దిక్కు లేదని, మూడు రాజధానులు ఏర్పాటు చేయడం వల్ల సామాన్యుడికి ఎంత మేరకు సౌకర్యంగా ఉంటుంది? అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రులు మారినా ప్రభుత్వం అనేది నిరంతరం కొనసాగుతుందని, ఈ విషయమే అర్థం కాకపోతే ఇంకేమంటామంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏపీలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదని అన్నారు. ప్రజల మనోభావాలను ప్రభుత్వం తెలుసుకోవడం లేదని విమర్శించారు.