తెలంగాణలో భారీగా డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఏకంగా 15 మంది డీఎస్పీలను బదిలీ చేశారు. డీఎస్పీలను బదిలీలు చేస్తూ డీజీపీ మహేందర్రెడ్డి ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా…దుబ్బాక ఎన్నిక నేపథ్యంలో గత నెలలో సిద్దిపేట నుంచి సంగారెడ్డి జిల్లాకు బదిలీ ఐన కలెక్టర్ వెంకటరామిరెడ్డిని మళ్ళీ సిద్దిపేట కలెక్టర్ గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దుబ్బాక ఉప ఎన్నికకు ముందు మెదక్ జిల్లా కలెక్టర్ గా నియమితులైన సంగారెడ్డి కలెక్టర్ ఎం. హనుమంత రావును తిరిగి సంగారెడ్డికి బదిలీ చేసింది. ఇప్పటి వరకు సిద్దిపేట కలెక్టర్ గా ఉన్న మంచిర్యాల కలెక్టర్ భారతి హోలికేరిని మళ్ళీ మంచిర్యాల కు పంపించింది. ఆ జిల్లా కలెక్టర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సిక్తా పట్నాయక్ ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది ప్రభుత్వం. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న శశాంక్ కు ఆ బాధ్యతల నుంచి విముక్తి కల్పిస్తూ ఆ స్థానంలో హోలికేరికి అదనపు బాధ్యతలు బాధ్యతలు అప్పగించింది. మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు బదిలీ కాగా.. హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతికి మల్కాజిగిరి జిల్లా అదనపు బాధ్యతలు అప్పగించారు.
- బదిలీ అయిన డీఎస్పీల వివరాలు…
కాచిగూడ ఏసీపీగా ఆకుల శ్రీనివాస్
బంజారాహిల్స్ ఏసీపీగా సుదర్శన్
సంగారెడ్డి డీఎస్పీగా బాలాజీ
ఎల్బీనగర్ డీఎస్పీగా శ్రీధర్రెడ్డి
పఠాన్ చెరువు డీఎస్పీగా భీం రెడ్డి
పంజాగుట్ట ఏసీపీగా గణేష్
సిద్దిపేట ఏసీపీగా రామేశ్వర్
శంషాబాద్ డీఎస్పీగా జైపాల్రెడ్డి
బాన్సువాడ డీఎస్పీగా జైపాల్రెడ్డి
ఇంటిలిజెన్స్ డీఎస్పీగా కె.శ్రీనివాస్ రావు
ఆ బాలీవుడ్ సినిమా చేసినందుకు బాధ పడడం లేదు : పూజాహెగ్డే