telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మహారాష్ట్ర సీఎంను కలిసిన కేసీఆర్‌

kcr maharashtra acm

మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్‌ కలిశారు. ఈ సందర్భంగా ఈ నెల 21న జరిగే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేయాల్సిందిగా ఫడ్నవీస్‌ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. శుక్రవారం ఉదయం 10.20 గంటలకు ఆయన హైదరాబాద్‌ నుంచి బయలుదేరి ముంబై వెళ్లారు.

మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం అధికార నివాసమైన వర్షకు చేరుకున్నారు. అంతకుముందు సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌లో గవర్నర్ సిహెచ్. విద్యాసాగర్ రావును కలిసి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. సీఎం వెంట మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Related posts