కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఫిలిప్పీన్స్లోని మనీలా ఎయిర్పోర్టులో చిక్కుకున్న..146 మంది భారతీయులను వెనక్కి రప్పించాలని ఆ లేఖలో కోరారు. మనీలా విమానాశ్రయంలో చిక్కుకున్న వారిలో 41 మంది ఏపీవాసులు ఉన్నారు.
మరో 40 మంది తెలంగాణ వాసులు ఉన్నారని వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందన్నారు. తక్షణమే స్పందించి విద్యార్థులను స్వస్థలాలకు చేర్చాలని చంద్రబాబు ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.