telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

కాంగ్రెస్ కి .. భారీ షాక్.. 12 మంది జంప్ ..

congress-logo

కాంగ్రెస్‌కు మణిపూర్‌లో భారీ షాక్ తగిలినట్టే.. ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరందరూ త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మణిపూర్‌లోని రెండు స్థానాల్లో ఒక దానిని బీజేపీ గెల్చుకోగా, రెండో దానిని నాగా పీపుల్స్ ఫ్రంట్ కైవసం చేసుకుంది. దీంతో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ వీరంతా పార్టీకి రాజీనామా చేశారు.

వీరందరూ సీడబ్ల్యూసీ సభ్యుడు, పీసీసీ చీఫ్ గయ్‌ఖంగంకు తమ రాజీనామా పత్రాలను అందించారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు అందరూ బీజేపీలో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తలపై సీనియర్ నేత ఒకరు స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపడేశారు. పార్టీని కిందిస్థాయి నుంచి బలోపేతం చేసి కార్యకర్తల్లో పార్టీపై నమ్మకం పెంచేందుకే తాము రాజీనామా చేసినట్టు తెలిపారు.

Related posts