అక్కినేని సమంత ‘ఏమాయ చేశావే’ సినిమాతో తన సినీ కెరీర్ని ప్రారంభించింది. తాజాగా ‘హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019’ టైటిల్నూ సాధించుకుంది. ఈ సందర్భంగా ఓ ఇంగ్లీషు ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా సిద్ధార్థ్తో లవ్ ఎఫైర్ గురించి కూడా వెల్లడించడం సెన్సేషన్గా మారింది. సమంత మాట్లాడుతూ.. “సావిత్రి గారి జీవితంలో చోటుచేసుకున్న కొన్ని సంక్షోభాలు నా జీవితంలో కూడా చోటు చేసుకున్నాయి. కానీ వాటిని మొదటనే గ్రహించి.. నా కెరీర్ని చక్కదిద్దుకున్నా.. లేకుంటే.. నేను కూడా మరో సావిత్రిలా తయారయ్యేదాన్ని. ఆ రిలేషన్ నుంచి ఫాస్ట్గా బయటపడ్డాను.. కాబట్టే నా జీవితంలో పెద్ద ముప్పు నుంచి తప్పించుకున్నాను. అలాగే నాకు నాగచైతన్య లాంటి వ్యక్తి దొరకడం అదృష్టం. చైతూ నాకు భగవంతుడు ఇచ్చిన కానుక అని భావిస్తాను” అని తెలిపింది. కాగా.. 2017లో నాగ్, సామ్ల పెళ్లి అంగరంగ వైభవంగా గోవాలో జరిగింది. క్రైస్తవ, హిందూ సంప్రదాయల ప్రకారం వీరి వివాహం జరిగింది. ఏమాయ చేశావే సినిమా తర్వాత చైతూ, సామ్ మంచి స్నేహితులయ్యారు. ఆ తర్వాత సిద్ధార్థ్తో ‘జబర్దస్త్’ అనే సినిమా చేసింది సామ్. ఈ సినిమాలోనే అతనితో ప్రేమలో పడింది. అది కాస్తా పెళ్లిదాకా వచ్చింది. దీంతో శ్రీశైలంలో వీరిద్దరూ కలిసి పూజలు కూడా చేశారు. మరి కొద్ది రోజుల్లోనే వీరి పెళ్లి జరుగుతుందని అనుకునే లోపే.. అనూహ్యంగా వీరి మ్యారేజ్కి బ్రేక్ పడింది.
previous post