telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

భారత్ తో టెస్ట్ సిరీస్ కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా…

భారత్-ఆసీస్ ల ఈ నెల 27 నుండి మధ్య సిరీస్ లు ప్రారంభం కానున్నాయి. ఈ పర్యటన కోసం బీసీసీఐ మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టు ఎప్పుడో ప్రకటించింది. ఐపీఎల్ ముగిసిన వెంటనే నిన్న భారత జట్టు ఆస్ట్రేలియా కు కూడా బల్దేరింది. ఇక తాజాగా ఈ రోజు భారత్ తో జరగనున్న టెస్ట్ సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ఎంపిక చేసింది. మొత్తం 17 మంది జట్టు సభ్యులకు ఎంపిక చేసిన బోర్డు అందులో 5 యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. ఇందులో విల్ పుకోవిస్కి అనే ఆటగాడు దేశవాళీ క్రికెట్ లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు సాధించి జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అయితే ఈ సిరీస్ కంటే ముందు జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్ కు ఆసీస్ బోర్డు ఇంతకముందే జట్టును ప్రకటించింది.

ఆసీస్ టెస్ట్ జట్టు : టిమ్ పైన్ (కెప్టెన్), జేమ్స్ ప్యాటిన్సన్, విల్ పుకోవ్స్కి, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, సీన్ అబోట్, జో బర్న్స్, పాట్ కమ్మిన్స్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్ , మార్నస్ లాబుస్చాగ్నే, నాథన్ లియోన్, మైఖేల్ నేజర్.

ఆసీస్ వన్డే, టీ20 జట్టు : ఆరోన్ ఫించ్ (c), సీన్ అబోట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, పాట్ కమ్మిన్స్(vc), కామెరాన్ గ్రీన్, జోష్ హాజెల్వుడ్, మొయిసెస్ హెన్రిక్స్, మార్నస్ లాబుస్చాగ్నే, గ్లెన్ మాక్స్వెల్, డేనియల్ సామ్స్, కేన్ రిచర్డ్సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్ మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జాంపా.

Related posts