హైదరాబాద్ మెట్రో రైల్ లో ప్రయాణానికి క్యూఆర్ కోడ్ టికెట్ బుకింగ్ ప్రారంభమైంది. హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ లో ఈ విధానాన్ని మెట్రో ఎండీ, ‘మేక్ మై ట్రిప్’ సీఈఓ ఎన్వీఎస్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రయాణికుల సమయం వృథా కాకుండా ‘మేక్ మై ట్రిప్’ క్యూఆర్ కోడ్ ద్వారా ప్రయాణించవచ్చని తెలిపారు.
దీంతో ఆరుగురి వరకు ఒకేసారి టికెట్ బుక్ చేసుకోవచ్చని వివరించారు. బుక్ చేసిన ట్రిప్ ను వాట్సప్ ద్వారా సంబంధిత వ్యక్తులకు షేర్ చేయవచ్చని, రిసీవ్ చేసుకున్న వ్యక్తులు దానిని వేరే వారికి షేర్ చేయొద్దని సూచించారు. మొదట 20 మెట్రో స్టేషన్లలో ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని, జనవరి నుంచి మిగతాస్టేషన్లలో అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.
చర్చలు జరపాలని కోర్టు చెబుతుంటే..కేసీఆర్ షరతులు పెడుతున్నారు: వీహెచ్