నేడు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ యుద్ధ విమానం తేజస్లో విహరించారు. బెంగుళూరులోని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన యుద్ధ విమానంలో ఎగిరారు. ఎయిర్ వైస్ మార్షల్ ఎన్ తివారీ.. కేంద్ర మంత్రితో విహరించారు. స్వదేశీ పరిజ్ఞానంతో లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్ను తయారు చేసిన విషయం తెలిసిందే. ఈ యుద్ధ విమానాన్ని ఇటీవల రక్షణ దళంలోకి ఇండక్ట్ చేశారు.
తేజస్లో విహరించిన తొలి రక్షణ మంత్రిగా కూడా రాజ్నాథ్ సింగ్ రికార్డు క్రియేట్ చేశారు. ఈ ఈమెంట్లో పాల్గొనేందుకు ఆయన ఇవాళ ఉదయం జీ-సూట్ ధరించారు. తేజస్ విహరించడానికి ముందు తన ట్వీట్లో ఈ విషయాన్ని వెల్లడించారు. తేజస్లో రెండు సీట్లు ఉంటాయి. గత శుక్రవారం గోవాలో నిర్వహించిన ల్యాండింగ్ పరీక్షలో తేజస్ విజయవంతమైంది. బెంగుళూరులో జరగనున్న డిఫెన్స్ ఎగ్జిబిషన్లోనూ రక్షణ మంత్రి పాల్గొంటారు.