తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గాయి. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 582 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. 1,432 కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. తాజాగా మరో నలుగురు మృతిచెందారు.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 2,31,834కి చేరుకోగా.. ఇప్పటి వరకు 2,11,912 మంది కరోనాబారినపడి కోలుకున్నారు.. ఇక, మృతుల సంఖ్య 1311కు పెరిగింది.. దేశంలో కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.56 శాతానికి తగ్గిపోయిందని.. రికవరీ రేటు భారత్ వ్యాప్తంగా 90.2 శాతంగా ఉంటే… తెలంగాణలో 91.40 శాతానికి పెరిగిందని వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్లో పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,611 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 15,582 మంది హోం ఐసోలేషన్లోనే ఉన్నారు. అయితే ఆదివారం కరోనా టెస్ట్ల సంఖ్య భారీగా తగ్గి పోయింది. అందుకే కరోనా కేసులు కూడా భారీగా తగ్గాయి.
previous post
ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోవాలంటే జనసేనను గెలిపించాలి: పవన్