telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇక ఆన్ లైన్ ద్వారా ఆర్టీసీ బస్ పాస్!

passengers fire on tsrtc buses shortage

విద్యార్థుల రాయితీ బస్ పాస్ పరిధిని 35 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రభుత్వం ఈరోజు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ఆర్టీసీ బస్ పాసులను ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది.

ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో విద్యార్థులు ఇంటి నుంచే పాస్ లు పొందేలా కొత్త విధానాన్ని ఆర్టీసీ తీసుకొచ్చింది. దీనివల్ల విద్యార్థులకు గంటలకొద్ది క్యూలైన్లలో నిలబడాల్సిన బాధ తప్పనుంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలువురు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

Related posts