telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రైతు దినోత్సవం సందర్భంగా రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితులు: చంద్రబాబు

chandrababu

ప్రపంచ రైతు దినోత్సవం సందర్భంగా రైతులు రోడ్డెక్కడంపై  బాధ పడుతున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిలో పోరాటం చేస్తున్న రైతులకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నడూ గడపదాటి బయటికి రాని ఆడపడుచులు ఇవాళ రోడ్డెక్కాల్సిన పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదో ఒక పనిచేసుసుకునే రైతన్నలు ఆందోళన బాటపట్టారని వివరించారు.

రాజధాని కోసం ఒక్క వివాదం లేకుండా 33 వేల ఎకరాలు సేకరించడం సాధ్యమా అని దీని గురించి ప్రపంచ ప్రఖ్యాత వర్శిటీలు అధ్యయనం చేశాయని వివరించారు. ఇవాళ ల్యాండ్ పూలింగ్ లో భూములిచ్చిన 29 గ్రామాల రైతులందరూ న్యాయం చేయమని అడుగుతున్నారని, వారందరికీ న్యాయం జరగాలని ఆకాంక్షించారు. గత ప్రభుత్వ నిర్ణయాలతో తమకు సంబంధంలేదని ప్రభుత్వం అంటే అది చట్టవిరుద్ధం అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.

Related posts