పార్టీ ఫిరాయింపులపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్సభలో ప్రస్తావించారు. అందరూ బీజేపీలో చేరడమే సబ్కా వికాస్కు అర్థమా? అని ప్రశ్నించారు. దేశంలో ఎమర్జెన్సీని మించిన పరిస్థితులు ఉన్నాయని బీజేపీ పాలనపై విమర్శలు గుప్పించారు. లోక్సభ సమావేశాల్లో ప్రసంగించిన ఎంపీ గల్లా జయదేవ్.. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశామన్నారు. హోదాపై మాట తప్పినందుకు ఏపీలో బీజేపీ అడ్రస్ గల్లంతైందని గుర్తుచేశారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని హామీ ఇచ్చినందుకు వైసీపీని ప్రజలు గెలిపించారని అన్నారు. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం లేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారని, ఈ నేపథ్యంలో హోదా సాధించాల్సిన బాధ్యత వైసీపీ పైనే ఉందని గల్లా స్పష్టం చేశారు. హోదాపై నమ్మకంతోనే ప్రజలు వైసీపీకి స్పష్టమైన మెజారిటీ అందించారని అభిప్రాయపడ్డారు.
తనను గద్దె దింపేందుకు బీజేపీ ఎన్నో కుట్రలు: కుమారస్వామి