దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుమారు 10 మంది గాయపడగా.. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఢిల్లీ కైరారీ ప్రాంతంలో మూడంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో బట్టల దుకాణం నిర్వహిస్తున్నారు.
మిగతా మూడంతస్తుల్లో ఇండ్లు ఉన్నాయి. అయితే రెండో అంతస్తులోని ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి గోడ కూలిపోయింది. ఆ మంటలు గ్రౌండ్ ఫ్లోర్ లోని క్లాత్ గోడౌన్ కు వ్యాపించాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసింది.
‘కియా తరలింపు’ వార్తలపై స్పందించిన లోకేశ్