దేశంలో ఇప్పటి వరకు 258 కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్క రోజే 55 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. 18 రాష్ట్రాలు మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. కరోనాతో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారు. ఢిల్లీ, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్రలో ఒక్కొక్కరి చొప్పున మృతి చెందారు.
తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 19కి చేరింది. నిన్న ముగ్గురిలో కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. హైదరాబాద్లో కరోనా వ్యాప్తి చెందకుండా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో డీఆర్ఎస్ సిబ్బంది క్రిమి సంహారక మందు స్ప్రే చేస్తున్నారు. ప్రజలు అధికంగా ఉండే బస్ స్టాండులు, మెట్రో స్టేషన్ల వద్ద పార్కుల్లో ఈ పనులు కొనసాగుతున్నాయి.