సిద్దిపేట శివారులో ఘోర ప్రమాదం జరిగింది. సిద్దిపేట జిల్లా రాజీవ్ రహదారిపై పెద్దపల్లి నుండి హైదరాబాద్ కు వెళ్తున్న రాజిరెడ్డి అనే వ్యక్తి నడుపుతున్న కారు సిద్దిపేట రాజీవ్ రహదారి పై డివైడర్ కు ఢీ కొట్టికొట్టడంతో కార్ లో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న సిద్దిపేట టూ టౌన్ సీఐ పరశురాం , ఎస్ఐ కనకయ్య మరియు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని శవాలను మార్చురీ కి తరలించడానికి ప్రయత్నిస్తుండగా,అదే సమయంలో కరీంనగర్ నుండి వస్తున్న DCM ఘటనాస్థలిలో గుమిగూడిన జనంపైకి దూసుకొచ్చిన డీ కొట్టగా సిద్దిపేట సీఐ పరశురాం గౌడ్ తో పాటు కానిస్టేబుల్స్, మరియు 10 మంది స్థానికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామునిపట్ల గ్రామానికి మల్లేశం, మందపల్లి కి చెందిన రాజిరెడ్డి మృతి చెందారు. ఈ ప్రమాదం నుండి SI కనకయ్య గౌడ్ క్షేమంగా బయట పడ్డారు. ఘటన స్థలానికి CP జోయల్ డేవిస్ సిద్దిపేట్, ACP రామేశ్వర్ వచ్చి క్షేతగాత్రులని చికిత్స గురించి హాస్పిటల్స్ కు పంపించారు.
previous post
next post