telugu navyamedia
రాజకీయ వార్తలు

మోదీ ట్వీట్‌ను గుర్తు చేస్తూ చిదంబరం విమర్శలు

congress chidambaram

2013లో గుజరాత్ సీఎంగా నరేంద్ర మోదీ ఉన్న సమయంలో ఆయన చేసిన ఓ ట్వీట్‌ ను గుర్తు చేస్తూ కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం తీవ్ర విమర్శలు గుప్పించారు.

2013లో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడిందని,మోదీ అన్నారు. యువతకు ఉద్యోగాలు కావాలని సమయాన్ని అనవసర రాజకీయ చర్యలకు కాకుండా ఆర్థికవ్యవస్థను బాగు చేసేందుకు కేటాయించాలని మోదీ అప్పట్లో ట్వీట్ చేశారు.

అప్పట్లో మోదీ చేసిన ట్వీట్‌నే ఈ రోజు చిదంబరం గుర్తు చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. తాను కూడా ఇప్పుడు ప్రధానికి చెప్పదలుచుకున్నది అదే అంటూ చురకలంటించారు. మోదీ హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే.

Related posts