telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ పదవికి రాజీనామా…

uttam congress mp

తాజాగా వెలువడిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ వైఫల్యం చెందింది. 2016 లో కాస్త పరువు నిలబెట్టుకునేలా సీట్లు సంపాదించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మరీ దారుణంగా రెండు స్థానాలకు పడిపోయింది. ఈ క్రమంలో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. పిసిసి అధ్యక్షుడి పదవికి ఉత్తంకుమార్ రెడ్డి రాజీనామా చేసేశారు. ఆయన కొద్ది సేపటి క్రితం తన రాజీనామా లేఖను ఏఐసీసీకి పంపారు. అంతకుముందే ఆయన ఒక గంటలో కీలక ప్రకటన చేస్తానంటూ మీడియా కి సమాచారం ఇచ్చారు. అదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఫలితాలు తీవ్రంగా నిరాశపరిచాయి ఆయన పేర్కొన్నారు. కొత్త పీసీసీ చీఫ్ ప్రక్రియను ప్రారంభించాలని కూడా ఉత్తమ్ లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గ్రేటర్‌లో జరిగిన తాజా ఎన్నికల్లో కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికలో ఎవరు ఊహించని విధంగా బీజేపీ తన సత్తా నిరూపించింది. మరి చూడాలి తెలంగాణలో కొత్త పిసిసి అధ్యక్షుడు ఎవరు అవుతారు అనేది.

Related posts