telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

లాక్ డౌన్ ఉల్లంఘించిన ఎమ్మెల్యేపై కేసు నమోదు

Congress Website hacking gujarat

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో కొందరు నేతలు నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు కేవలం సామాన్యులకేనన్నట్టుగా నేతలు ప్రవర్తిస్తున్నారు. పుదుచ్చేరిలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జాన్ కుమార్ లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి పెద ప్రజలకు బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా పాల్గొన్నారు. దీంతో రెవెన్యూ అధికారులు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. జాన్ కుమార్ పై ఈ విధమైన కేసు నమోదు కావడం ఇది రెండో సారి. గతంలో కూడా ఆయన లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ఇంటి ముందు దాదాపు 200 మందికి కాయగూరలు పంపిణీ చేశారు. పుదుచ్చేరి సీఎం నారాయణస్వామికి జాన్ కుమార్ అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం.

Related posts