రష్మిక మందన్న ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు మీడియా ఇంట్రాక్షన్స్లో చురుకుగా పాల్గొంటూ ఉంటుంది రష్మిక.అందరు హీరోయిన్లకు భిన్నంగా స్పెషల్ దారిలో వెళ్తూ అనతి కాలంలోనే అశేష అభిమాన వర్గం సంపాదించింది ఈ కన్నడ భామ. కాగా తన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే ఆమె.. తాజాగా జరిగిన ఓ మీడియా సమావేశంలో తనకున్న అలవాటు గురించి బయట పెట్టేసింది. ప్రస్తుతం రష్మిక మందన్న ట్రెండ్ నడుస్తోంది. గీతగోవిందం సినిమాలో విజయ్ దేవరకొండతో ఆమె చేసిన రొమాన్స్ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. దీంతో రష్మిక వెంటే పడుతున్నారు దర్శకనిర్మాతలు. దీంతో ఆమెకు వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. రష్మిక మందన్న టాలెంట్ చూసి కేవలం టాలీవుడ్ దర్శకులు మాత్రమే కాదు కోలీవుడ్ దర్శకులు కూడా ఆమెతో సినిమాలు చేసేందుకు పోటీ పడుతున్నారు.
ఆమె మాతృభాష కన్నడలో జోష్ నడుస్తూనే ఉంది. ఇలా సాఫీగా సాగుతున్న వెండితెర ప్రయాణంతో ఎంజాయ్ చేస్తోంది రష్మిక. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్నాను కాబట్టి.. ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి ఉంటుందని అంటోంది రష్మిక. అందుకే ఎప్పుడు కూడా సర్దిపెట్టుకున్న ఓ సూట్కేసు తన వెంటే ఉంటుందని చెబుతోంది ఈ కన్నడ ముద్దుగుమ్మ. తనకు తన సినిమాలపై ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందనే దానిపైనే ద్యాస ఉంటుందని అంటోంది రష్మిక మందన్న. సినిమాల్లో రాణిస్తున్నానే సంతోషం ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో బెంగ కూడా ఉంటుందని చెబుతోంది. తన సినిమాల గురించి ఆరా దీయడం తనకో అలవాటుగా మారిందని అంటోంది. ఎలాగోలా సినిమా షూటింగ్ ఫినిష్ చేశాను కదా అని వదిలేయనని, ఇంకా ఆ సినిమాకు తన వైపు నుంచి కావాల్సినవి ఏంటనేది తెలుసుకుంటానని చెప్పింది రష్మిక. విడుదలయ్యే వరకు తనకు ఆ సినిమాపైనే ద్యాస ఉంటుందని, దాని వల్ల మంచి ఫలితాలుంటాయని అంటోంది.
నాగశౌర్య మొదలుకొని వరుసగా టాలీవుడ్ యంగ్ హీరోలతో రొమాన్స్ చేస్తోంది రష్మిక మందన్న. ప్రస్తుతం ఈమె నితిన్, మహేష్ బాబులతో సెట్స్పై చురుకుగా కదులుతోంది. నితిన్ సరసన భీష్మ, మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తోంది. రష్మిక మందన్న టాలెంట్ చూసి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా మనసు పడ్డారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్తో తాను చేయబోయే కొత్త సినిమాలో ఈమెనే హీరోయిన్గా ఎంచుకున్నారు. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
అక్కా అక్కా అంటూనే తొక్కేసారు… బిగ్ బాస్ పై హేమ వ్యాఖ్యలు