అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రంలో సమంత ఓ స్పెషల్ సాంగ్లో కనిపించి అలరించారు. తొలిసారి ‘పుష్ప’లో ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా!’ అంటూ అల్లు అర్జున్ సరసన ఆడింది. ఈ సాంగ్ యూట్యూబ్లో 100 మిలియన్ వ్యూస్ తో రికార్డుని సృష్టించింది. దీనిపై ఆనందంలో సమంత వివరిస్తూ ట్వీట్ చేసింది.
దీంతో నెటిజన్ రీట్వీట్ చేస్తూ.. ‘సమంత సెకండ్ హ్యాండ్ ఐటమ్. జెంటిల్మ్యాన్ నుంచి రూ.50 కోట్లు తీసుకుంది’ దారుణంగా ట్రోల్ చేశాడు. ఘాటుగా స్పందించిన సమంత.. ‘నీ ఆత్మకు ఆ దేవుడు శాంతి కలిగించాలి’ అంటూ అని సమంత అన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది.
దీనిపై అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు సమంతకు మద్దతుగా నిలిచారు. ‘నువ్వు ఎందుకూ పనికిరాని ఫస్ట్ హ్యాండ్ ఐటమ్’ అంటూ నటుడు బ్రహ్మాజీ సదరు నెటిజన్కు రిప్లై ఇచ్చారు.
ఓటు వేసే ముందు మనసాక్షితో ఆలోచించి నా బిడ్డను గెలిపించండి..!