గతేడాది అక్టోబర్లో ప్రముఖ బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా… బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో మీటూ ఉద్యమానికి తెరలేపింది. ఆ తర్వాత ఎందరో నటీమణులు తమను వేధించిన దర్శకులు, నిర్మాతలు, హీరోల పేర్లు బయటపెట్టారు. టాలీవుడ్ లో శ్రీరెడ్డి కూడా పలువురు ప్రముఖులపై ఆరోపణలు చేయడంతో ఈ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ముందుగా హాలీవుడ్లో మొదలైన మీటూ ఉద్యమం బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషల చిత్ర పరిశ్రమల్లోనూ వ్యాపించింది. తమకు గతంలో ఎదురైన లైంగిక వేధింపుల అనుభవాల గురించి హీరోయిన్లు బహిరంగంగా వెల్లడించారు. ప్రముఖులపై ఆరోపణలు గుప్పించారు. ఇలా మీటూ ఆరోపణలు చేసిన వారికి అవకాశాలు రాకపోవడం బాధాకరం అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా పేర్కొంది. “నేనెప్పుడూ లైంగిక వేధింపులకు గురవలేదు. అది నా అదృష్టం. సినీ పరిశ్రమలో ఎలా ప్రవర్తించాలో నాకు తెలుసు. అయితే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నవారు ధైర్యంగా వెల్లడించడం శుభపరిణామం. ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు. ఎదురించి పోరాడాల్సిందే. అయితే అలా మీటూ ఆరోపణలు చేసిన వారికి ఆ తర్వాత అవకాశాలు రాకపోవడం బాధాకరం” అని తమన్నా అన్నారు.
previous post