ఇటీవల “ప్రతిరోజూ పండగే” సినిమాతో భారీ విజయం అందుకున్నాడు మెగా హీరో సాయితేజ్. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం “సోలో బ్రతుకే సో బెటర్”. సాయితేజకు జోడిగా నభా నటేష్ నటిస్తోంది. సుబ్బు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శుక్రవారంతో పూర్తయింది. ‘ప్రతిరోజు పండగే’ తేజ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. చివరిరోజు యూనిట్ సభ్యులంతా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ వీడ్కోలు పలికారు. యూనిట్ సభ్యులందరూ తమ జర్నీని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. హీరో సాయి ధరమ్తేజ్ కూడా ఎమోషనల్ ట్వీట్ పెట్టాడు. “సరదా సరదాగా సాగిన మా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా షూటింగ్ పూర్తయింది. సెట్ మీద ఒక్క రోజు కూడా డల్ మూమెంట్ లేదు. మాస్క్ వేసుకుని షూటింగ్ చేసిన సందర్భాలైనా సరే.. మాస్క్ ధరించకుండా చేసిన సందర్భాలైనా సరే.. అంతా సరదాగా గడిచిపోయిదంటూ” సాయి ధరమ్ తేజ్ యూనిట్తో దిగిన ఫోటోను షేర్ చేశాడు.
A fun filled journey comes to an end. సరదా సరదాగా సాగిన మా #SoloBrathukeSoBetter సినిమా షూటింగ్ పూర్తయ్యింది. Never a dull moment on the sets. Not when we were shooting without masks and not when we were shooting with masks. pic.twitter.com/3Ypbn5bWRv
— Sai Dharam Tej (@IamSaiDharamTej) September 11, 2020
భర్తను అవమానించిన వారికి గడ్డి పెట్టిన సింగర్ సునీత