ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ స్పందించారు. పౌరసత్వ చట్టం తదితర అంశాలను బీజేపీ ప్రచార అస్త్రంగా చేసుకుందన్నారు. తద్వారా ఓట్లను చీల్చిందే తప్ప ఆ పార్టీ గెలవలేకపోయిందని తెలిపారు. అధిక నష్టం జరిగింది మాత్రం కాంగ్రెస్ పార్టీకేనని అన్నారు. కరోనా సోకితే ఎంత నష్టం జరుగుతుందో కాంగ్రెస్ కు, అంత నష్టం జరిగిందని తెలిపారు.
మైనారిటీ మతవాదంపై కాంగ్రెస్ సామరస్య ధోరణితో ఉంటోందన్న ప్రచారాన్ని చేయడంతో తప్పు జరిగిందని అన్నారు. మైనారిటీ ప్రజల మనోభావాల పట్ల కొందరు సీనియర్లు సున్నితంగా వ్యవహరించాలని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన ఆయన, దీంతో తాము మతవాదంపై చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నామన్న దుష్ప్రచారం జరిగిందని, దానివల్లే ఎంతో నష్టం జరిగిందని అన్నారు.