సోమవారం నగరంలోని పలు ప్రాంతాలలో బక్రీద్(ఈద్-ఉల్-జుహ) ప్రత్యేక ప్రార్ధనల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మిరాలం ట్యాంక్ ఈద్గా, హాకీ గ్రౌండ్, మాసబ్ ట్యాంక్, లంగర్హౌస్ ప్రాంతాలలో ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని ఆయన వెల్లడించారు. మిరాలం ట్యాంక్ ఈద్గా.
ఈద్గాకు ప్రార్ధనల కోసం వచ్చే వారు పురానపూల్, కామటిపురా, కిషన్బాగ్, బహుదూర్పురా ఎక్స్ రోడ్డు మీదుగా ఉదయం 8 నుంచి 11.30 గంటల మధ్యలో ఈ రూట్లలో రావాలని సూచించారు. ఈ వాహనాలను జూపార్కు ప్రాంతంలో పార్కు చేయాలి.
సాధారణ ట్రాఫిక్కు ఈద్గా రోడ్డు వైపు అనుమతి లేదు. ఈ ట్రాఫిక్ బహుదూర్పురా ఎక్స్ రోడ్డు వద్ద కిషన్బాగ్, కామటిపూర వైపు వెళ్లాలి.
శివరాంపల్లి వైపు నుంచి ప్రార్ధనల కోసం వచ్చే అన్ని వాహనాలకు దానమ్మ హాట్స్ రోడ్డు నుంచి ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు అనుమతిస్తారు, ఈ సమయంలో సాధారణ ట్రాఫిక్ను ఈద్గావైపు అనుమతించరు, దానమ్మ క్రాస్రోడ్స్ నుంచి శాస్త్రిపురం, ఎన్ఎస్కుంట రూట్లలో వెళ్లాలి. యూసుఫ్ పార్కింగ్, మజార్ పార్కింగ్, జయేష్ పార్కింగ్, మెడ్రన్ సా మిల్ పార్కింగ్ ఈద్గా ముందు ఉన్న ప్రధాన రోడ్డు, మిర్ అలామ్ ఫిల్టర్ బెడ్, యాదవ్ పార్కింగ్లలో వాహనాలు పార్కు చేయాలి.
కలాపత్తార్ నుంచి ఈద్గాకు వచ్చే వాహనాలు కలాపత్తార్ ఠాణా వైపు నుంచి ఉదయం 8 నుంచి 11.30 వరకు అనుమతిస్తారు, సాధారణ వాహనాలను మోచీ కాలనీ, బహుదూర్పురా వైపు మళ్లిస్తారు. ఈ రూట్లో వచ్చే వాహనాలు భయ్యా పార్కింగ్, మెడ్రన్ పెట్రోల్ బంక్, బీఎన్కే కాలనీలలో పార్కు చేయాలి.
ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు పురానపూల్ నుంచి బహుదూర్పురా వైపు వెళ్లే భారీ వాహనాలను జియగూడ, సిటీ కాలేజీ వైపు మళ్లిస్తారు.
ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు శంషాబాద్, రాజేంద్రనగర్ వైపు నుంచి బహుదూర్పురా వైపు వచ్చే వాహనాలను అరాంఘర్ జంక్షన్ వద్ద నుంచి మళ్లిస్తారు. మాసబ్ ట్యాంక్ హాకీ గ్రౌండ్లో ప్రార్ధనలు.. ట్రాఫిక్ మళ్లింపు.
మెహిదీపట్నం నుంచి మాసబ్ ట్యాంక్ మీదుగా బంజారాహిల్స్ రోడ్డు నెం.1లోకి వెళ్లే వాహనాలను మాసబ్ ట్యాంక్ ైప్లెవోర్, అయోధ్య జంక్షన్, ఖైరతాబాద్, తాజ్కృష్ణా హోటల్ రూట్లలో మళ్లిస్తారు.
రోడ్డు నెం.12 నుంచి బంజారాహిల్స్ మీదుగా మాసబ్ట్యాంక్ వైపు వచ్చే బస్సులను 1/12 జంక్షన్ నుంచి తాజ్ కృష్ణ, ఖైరతాబాద్ రూట్లలో మళ్లిస్తారు.
లక్డీకపూల్ వైపు నుంచి 1/12 రూట్లో బంజారాహిల్స్ వైపు మాసబ్ట్యాంక్ మీదుగా వెళ్లే వాహనాలను అయోధ్య జంక్షన్, ఖైరతాబాద్, తాజ్కృష్ణ రూట్లలో మళ్లిస్తారు. మాసబ్ట్యాంక్ ైప్లెవోర్ కింది రూట్లో ఏ వాహనాలను అనుమతించరు.
సాధారణ వాహనాలను 1/12 నుంచి చింతల్బస్తీ రూట్లో మళ్లిస్తారు. లంగర్హౌస్లో ట్రాఫిక్ మళ్లింపు.
నానల్నగర్ నుంచి నుంచి ఆంధ్రఫ్లోర్ మిల్స్ వైపు వెళ్లే వాహనాలను బాలిక భవన్ జంక్షన్ నుంచి లక్ష్మినగర్ వైపు మళ్లిస్తారు.
ఎండీలైన్స్, బాలిక భవన్ వైపు నుంచి వచ్చే వాహనాలను మిలటరీ దవాఖాన వైపు అనుమతించరు, ఈ రూట్ వాహనాలను ఆంధ్రఫ్లోర్ మిల్ వద్ద బాలిక భావన్ వద్ద మళ్లిస్తారు.
లంగర్హౌస్ వైపు నుంచి వచ్చే సాధారణ వాహనాలను మిలటరీ దవాఖాన వైపు అనుమతించరు, ఈ వాహనాలను మెగల్కా నాలా వైపు మళ్లిస్తారు.