దేశంలో కరోనాను కట్టడి చేయడానికి లాక్డౌన్ను మరో మే 3 వరకు పొడిగిస్తూ మోదీ నిర్ణయం తీసుకున్నారు. అయితే, మోదీ నిర్ణయానికి సెలబ్రిటీల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రభుత్వ ఆదేశాలను గౌరవిస్తూ మే 3 వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచిస్తున్నారు. ప్రధాని నిర్ణయానికి మద్దతు తెలుపుతూ రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేశారు. ప్రజలంతా మరికొద్ది రోజులు ఈ లాక్డౌన్ను కచ్చితంగా పాటించాలని ఆమె కోరారు. మన రోజువారీ జీవితం కరోనా వైరస్ వల్ల చాలా డిస్టర్బ్ అయ్యింది. స్కూల్స్, కాలేజీలు మూతబడ్డాయి. అందరూ ఇంట్లో ఉండి పనిచేస్తున్నారు. ఇదంతా మన భద్రత కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. 21 రోజులపాటు మనం ఇళ్లలో కూర్చున్నాం. కానీ, ఇది సరిపోవడం లేదు. రోజురోజుకి కేసులు పెరుగుతున్నాయి. కాబట్టి ఇంకొంచెం మనం ఓపికపట్టాలి. మన భద్రత కోసం, మన కుటుంబ సభ్యుల భద్రత కోసం మనం ఇంట్లో కూర్చోవాలి అని రేణు దేశాయ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
previous post
తన ఆరోగ్యంపై అమితాబ్ షాకింగ్ కామెంట్స్