లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘించి మందు పార్టీ చేసుకున్న కోవిడ్ అధికారుల బృందంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి ఖమ్మం జిల్లా మధిర రెవెన్యూ గెస్ట్హౌస్లో తహసీల్దార్ సైదులు, ఈవోపీఆర్డీ రాజారావు, సబ్ జైలర్ ప్రభాకర్రెడ్డి తదితరులు మందు పార్టీ చేసుకుంటూ మీడియాకు దొరికిపోయారు.మీడియాను చూసి పార్టీ చేసుకుంటున్న వారంతా పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు గెస్ట్ హౌస్కు చేరుకుని పరిశీలించారు.
ఖరీదైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, మటూరుపేట పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నారు.విచారణలో ఆయన వెల్లడించిన వివరాల ఆధారంగా నలుగురు అధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. భౌతిక దూరాన్ని మరిచి, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి అధికారులు పార్టీ చేసుకున్న వార్తలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువిరుస్తున్నాయి.