భారత క్రికెట్ టీం లో సరికొత్తగా రాణిస్తూ సంచలనం సృష్టించిన నవదీప్ సైనీ తాజా మ్యాచ్ తో స్టార్ అయ్యాడు. ఈ యువ ఫాస్ట్ బౌలర్ వెస్టిండీస్ తో తొలి టీ20లో 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. సైనీ స్పీడ్ కు విండీస్ బ్యాట్స్ మెన్ వద్ద సమాధానం లేకపోయింది. పొలార్డ్ అంతటివాడు కూడా సైనీ విసిరిన ఓ ఓవర్లో ఒక్క పరుగూ తీయలేక చివరికి వికెట్ సమర్పించుకున్నాడు. కాగా, మ్యాచ్ ముగిశాక సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ బీసీసీఐ తరఫున సైనీని ఇంటర్వ్యూ చేశాడు.
ఈ సందర్భంగా సైనీ చేతిపై ఉన్న తోడేలు పచ్చబొట్టు గురించి అడిగాడు. చిన్నప్పుడు తాను ఎక్కువగా తోడేలు నేపథ్యం ఉండే సినిమాలు ఎక్కువగా చూసేవాడ్నని, అందుకే విభిన్నంగా ఉంటుందని తోడేలు పచ్చబొట్టు వేయించుకున్నానని తెలిపాడు. అరంగేట్రం గురించి చెబుతూ, మ్యాచ్ కు ముందు టీమిండియా టోపీ అందుకుంటున్నప్పుడు నమ్మలేకపోయానని అన్నాడు. తొలి మ్యాచ్ కావడంతో కొంత ఒత్తిడికి లోనయ్యానని, మొదటి వికెట్ తీశాక ఆ ఒత్తిడి మొత్తం తొలగిపోయిందని తెలిపాడు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక కార్యకలాపాలను జగన్ దెబ్బతీశారు: యనమల