టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున ఈరోజు 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని 61 వ జన్మదిన వేడుకలను జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా సినిమా ప్రముఖులు, ఆయన అభిమానుల నుంచి సోషల్ మీడియా వేదికగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువగా వస్తున్నాయి. కాగా నాగార్జున తాజాగా తన అభిమానికి ఫోన్ చేసి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నెల్లూరుకు చెందిన లక్ష్మీ, ఆమె కుటుంబమంతా అక్కినేని కుటుంబానికి వీరాభిమానులు.. లక్ష్మీ బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నారు. గతకొద్ది కాలంగా ఆమె ఈ మహమ్మారితో పోరాడుతున్నారు. ఇప్పటికే మూడు సార్లు సర్జరీ జరిగింది. కొద్దిరోజుల్లో ఫైనల్ సర్జరీకి వెళ్లనున్నారు. అభిమానుల ద్వారా విషయం తెలుసుకున్న నాగార్జున జూమ్ ద్వారా వీడియో కాల్ చేసి లక్ష్మీని ప్రేమతో పలకరించారు. పరామర్శించి ధైర్యం చెప్పారు. ‘‘మీ ఫాదర్ నుంచి మా ఫ్యామిలీ మొత్తం మీ కుటుంబానికి అభిమానులం.. సార్.. మీరు కాల్ చేశారు.. ఈ జన్మకిది చాలు.. చనిపోయినా పర్వాలేదు’’ అంటూ ఆమె భావోద్వేగానికి గురవ్వగా… ‘ఎందుకు చనిపోతారండీ, చనిపోరు.. బాగుంటారు’’ అంటూ నాగ్ ఆమెను ఓదార్చారు. అక్కినేని అభిమానులు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ లక్ష్మీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
Lakshmi from Nellore is suffering from Brain Tumour already 3 surgery’s done and in few months she will go with final surgery and she is a big fan of Nagarjuna Garu we have informed and sir has spoken through Zoom today and she is full happy now thanks a lot @iamnagarjuna
garu pic.twitter.com/HzNm18xUHZ— Y.Chandra Sekhar (@chandra99997) August 28, 2020
ఆ సినిమా కథ విని దర్శకుడిని తిట్టేశా.. : సంగీత