దేశంలోని ప్రముఖ బ్యాంకులు పొదుపు డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పొదుపు ఖాతాలపై ఇస్తున్న వడ్డీని 2.75 శాతం నుంచి 2.70 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయం మే 31 నుంచి అమలులోకి వచ్చిందని ప్రకటించింది.
ఇదే సమయంలో రూ. 50 లక్షల లోపు ఉండే ఖాతా డిపాజిట్లపై వడ్డీ రేటు 3.25 శాతం నుంచి 3 శాతానికి, రూ. 50 లక్షలపైన ఉండే డిపాజిట్లపై వడ్డీని 3.75 శాతం నుంచి 3.50 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ ప్రకటించింది. ఈ తగ్గింపు 4వ తేదీ గురువారం నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. మిగతా బ్యాంకులు కూడా ఇదే విధమైన నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
మరో రెండు టర్మ్లు నేనే సీఎంగా ఉంటా.. అసెంబ్లీలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు