telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

వరుసగా రెండో రోజు తగ్గిన పెట్రోలు ధర!

no licence renewal required to petrol and

దేశంలో పెట్రోలు ధరలు వరుసగా రెండో రోజూ కూడా కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు ఉదయం లీటరు పెట్రోలుపై 18 పైసలు, డీజిల్ పై 24 పైసల మేరకు ధరను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వెల్లడించాయి.

తాజా మార్పుతో హైదరాబాద్ లో పెట్రోలు ధర రూ. 84.75కు డీజిల్ ధర రూ. 79.08కి దిగివచ్చాయి. ఇదే సమయంలో అమరావతిలో పెట్రోలు ధర 17 పైసలు తగ్గగా, లీటరు రూ. 86.34కు చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలుపై 17 పైసలు, డీజిల్ పై 22 పైసల మేరకు ధరలు తగ్గాయి.  ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుదలను నమోదు చేయడంతో, ఒకటి, రెండు రోజుల్లోనే ఇండియాలోనూ ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

Related posts