తొలి దశ నామినేషన్ల పర్వం నేటి మధ్యాహ్నం మూడు గంటలకు ముగియనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా శుక్రవారం వరకు మొత్తం 220 నామినేషన్లు దాఖలయ్యాయి. నిజామాబాద్లో కవితకు వ్యతిరేకంగా బరిలోకి దిగాలన్న నిర్ణయంతో 50 మంది రైతులు నామినేషన్ వేశారు. నామినేషన్లకు నేడు చివరి రోజు కావడంతో భారీగా అభ్యర్థులతో ఆయా కార్యాలయాలు బిజీగా ఉండనున్నాయి.
నేటి వరకు వచ్చిన నామినేషన్లను మంగళవారం నుంచి అధికారులు పరిశీలిస్తారు. 28వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా లేదా అసంపూర్తిగా ఉన్న నామినేషన్లను అధికారులు తిరస్కరిస్తారు. ఉపసంహరణ గడువు ముగిశాక పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు.
హుజూర్నగర్ ఉపఎన్నికల్లో కేసీఆర్కు బుద్ధి చెబుతాం: ఉత్తమ్