దిశ హత్యాచార కేసులో నిందితులను పోలీసులు తెలంగాణ ఎన్ కౌంటర్ చేయడంపై దేశ వ్యాప్తంగా పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. దిశ హత్య ఎంత తీవ్ర స్థాయిలో కలచివేసిందో, ఇప్పుడు దిశ నిందితుల ఎన్ కౌంటర్ తో అంతకు రెట్టింపు స్థాయిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్ కౌంటర్ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సజ్జనార్ హీరో అయ్యారు. ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో సీపీ సజ్జనార్ పేరు మార్మోగుతోంది. సజ్జనార్ ను కీర్తిస్తూ నినాదాలు చేయడంతో పాటు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ ప్రజలు తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.