బీజేపీ ఎంపీ సుజనా చౌదరీ పై మచిలీపట్నం వైసీపీ ఎంపీ బాలశౌరి మండిపడ్డారు. చంద్రబాబు అజెండా మోయడానికే నీవు బీజేపీలో చేరిన మాట వాస్తవం కాదా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఒకప్పుడు ప్రధాని మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా సుజనా చౌదరీ ధర్మదీక్ష పోరాటాలు చేసారు. అలాంటిది ఇప్పుడు అదే పార్టీలో చేరి ఢిల్లీలో కూర్చొని చంద్రబాబు ఏజెంట్లా వ్యవహరిస్తూ విషపు కూతలు కూస్తున్నారంటూ నిప్పులు చెరిగారు.
నీకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా ? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమిత్ షాతో జరిపిన చర్చలకు సంబంధించిన వివరాలను గోడదూకిన నీలాంటి వారికి చెప్పే అర్హత లేదని విమర్శించారు. దీనికి సంబంధించి అధికారికంగా వెల్లడించే హక్కు కేంద్ర ప్రభుత్వానికే ఉంటుదన్న విషయం ఎలా మరిచిపోయావంటూ ప్రశ్నించారు. సుజనా చౌదరీ ఒక డుప్లికేట్ లీడర్ అని, ఆయన మాటలకు ఎక్కడా విలువ లేదని అన్నారు.
ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే తట్టుకోలేక అభాండాలు: జగన్