telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ప్రధాని అధ్యక్షతన నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశం….

Modi Mask

ప్రధాని మోడీ అధ్యక్షతన 6వ “నీతి ఆయోగ్‌” పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలితప్రాంతాల ముఖ్యమంత్రులు, యూటిల లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొననున్నారు. సమావేశంలో నీతి అయోగ్ పాలక మండలి ఎక్స్-అఫిషియో సభ్యులు, కేంద్ర మంత్రులు, వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, సిఇఒ ఆయోగ్ అమితాబ్ కాంత్ పాల్గొన్నారు. దేశంలో వ్యవసాయరంగం, మౌలిక సదుపాయాలు, తయారీ, మానవ వనరుల అభివృద్ధి, ప్రజా ఆరోగ్యంపై ఈ సమావేశంలో చర్చ జరుగనుంది. “నీతి అయోగ్” సమావేశంలో లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ మొదటిసారి పాల్గొననున్నారు. “నీతి అయోగ్” సమావేశానికి పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జ సమావేశానికి గైర్హాజరయ్యారు. అటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్‌ పాల్గొన్నారు.

Related posts