telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పోలీసుల తీరుపై రేవంత్ ఫైర్.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

Revanth-Reddy mp

తెలంగాణ పోలీసుల తీరుపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మేరకు పోలీసులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కోస్గి పట్టణంలో తమ శిబిరంలో ఉన్న 16వ వార్డు కౌన్సిలర్ ఎల్లమ్మను పోలీసులే బలవంతంగా టీఆర్ఎస్ క్యాంపునకు తరలించారని ఆరోపించారు.

ఈ మేరకు నారాయణపేట జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. పోలీసుల తీరును ఖండిస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు పోలీసుల వ్యవహార సరళిపై ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డికి కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Related posts