telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ఉద్యోగం రాలేదని విద్యార్థి సూసైడ్‌.. సెల్ఫీ వీడియో తీస్తూ

crime

తెలంగాణలో మరో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయడం లేదని మనస్తాపం చెందిన కేయూ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.10 రోజుల క్రితం బొడ్డ సునీల్ అనే కేయూ విద్యార్థి పురుగుల మందు తాగగా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందాడు. పరిస్థితి విషమించడంతో హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మరణించాడు. వరంగల్ రూరల్ జిల్లా గూడూరు మండలం తేజావత్ రామ్సింగ్ తండాకు చెందిన సునీల్ విద్యార్థుల సమస్యలపై పోరాటం చేసే వాడు. ఈ క్రమంలో కెసిఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోవడంలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసి ఈ విషయాన్ని సెల్ఫీ వీడియోలో తెలిపాడు. అయితే.. సునీల్‌ మృతిపై ప్రతిపక్షాలు ప్రభుత్వపై విరుచుకుపడుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇవాళ సునీల్‌ మృతదేహానికి నివాళులు అర్పించనున్నారు.

Related posts