telugu navyamedia
వార్తలు సామాజిక

దేశవ్యాప్తంగా కరోనా భయం.. సివిల్స్ ఇంటర్వ్యూలు వాయిదా!

upsc jobs notification for many posts

దేశవ్యాప్తంగా కరోనా భయం వెంటాడుతుండడంతో సివిల్స్ ఇంటర్వ్యూలను యూపీఎస్సీ వాయిదా వేసింది. గత ఏడాది సెప్టెంబరు 29వ తేదీన నిర్వహించిన యూపీఎస్సీ-2019 మెయిన్స్ పరీక్షల్లో ఇంటర్వ్యూలకు అర్హత సాధించిన వారి వివరాలను ఈ ఏడాది జనవరి 15న వెల్లడించింది.

వీరికి మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి ఇంటర్వ్యూలు జరగాల్సి ఉంది. దేశవ్యాప్తంగా విస్తరించడంతో ఇంటర్వ్యూలను వాయిదా వేస్తున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. 15 రోజుల తర్వాత వైరస్ ప్రభావం పై సమీక్షించిన అనంతరం తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

Related posts