telugu navyamedia
వార్తలు సామాజిక

వధువుకు కరోనా.. ఆగిన వివాహం!

వధువుకు కరోనా సోకిందని తేలడంతో మరికొన్ని గంటల్లో జరగాల్సిన ఓ వివాహం వాయిదా పడింది. ఈ ఘటన తమిళనాడులో ని కోవై జిల్లాలో జరిగింది. ఈ నెల 1న వధూవరులకు పెద్దలు వివాహాన్ని నిశ్చయించారు. ఢిల్లీలో ఉన్న వధువు వివాహం నిమిత్తం మరో ఐదుగురితో కలిసి గత నెల 29న కోవై జిల్లా పొల్లాచ్చికి దగ్గరలో ఉన్న వడగపాళయం గ్రామానికి చేరుకుంది.

నిబంధనల ప్రకారం అధికారులు గ్రామానికి చేరుకున్న వధువుతో సహా అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే, వధువుకు అప్పటికే కరోనా వైరస్ సోకివుందని తేలింది. దీంతో వివాహాన్ని ప్రస్తుతానికి ఆపివేశామని పెళ్లి పెద్దలు తెలిపారు.

Related posts