telugu navyamedia
క్రీడలు వార్తలు సామాజిక

జూలై నుంచి క్రికెట్ మ్యాచులు ..ఇంగ్లాండ్, విండీస్ మధ్య టెస్ట్ సిరీస్!

cricket

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు ఆటలకుతలమైన సంగతి తెలిసిందే. పలు దేశాల్లో వ్యాపార సంస్థలతో పాటు అన్నీ మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆట కూడా నిలిచిపోయింది. ఇన్నాళ్లు క్రికెట్ అభిమానులు మ్యాచ్ లు లేక నిరుత్సాహపడిపోయారు. ఇప్పుడు అభిమానులకు ఆనందాన్ని అందించేందుకు క్రికెట్ మళ్లీ వస్తోంది. ఇంగ్లాండ్ తో మూడు టెస్టుల సిరీస్ ఆడేందుకు వెస్టిండీస్ జట్టు లండన్ చేరుకుంది. వాస్తవానికి ఈ సిరీస్ జూన్ లోనే మొదలవ్వాల్సి ఉండగా, కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని జూలై 8 నుంచి షురూ కానుంది.

ఈ లోపు ఆటగాళ్లకు కరోనా వైద్య పరీక్షలు, విదేశాల నుంచి వచ్చినందున 14 రోజుల ముందస్తు క్వారంటైన్ వంటి చర్యలు తీసుకోనున్నారు. కాగా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మూడు టెస్టులకు ఓవల్, ఎడ్జ్ బాస్టన్, లార్డ్స్ మైదానాలు వేదికగా నిలుస్తున్నాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో స్టేడియాల్లో ప్రేక్షకుల్లేకుండానే మ్యాచ్ లు నిర్వహించనున్నారు.

Related posts