ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వయస్సుతో బేధం లేకుండా వ్యాపించి పలువురిని ఇబ్బందులకు గురి చేస్తోంది. తాజాగా కేరళకు చెందిన మూడేళ్ల బాలుడి రక్త పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఇండియాలో కరోనా సోకిన వారి సంఖ్య అధికారికంగా 40కి చేరుకుంది.
ఇటీవల బాలుడి కుటుంబం ఇటలీ నుంచి భారత్ కు వచ్చింది. ఈ కుటుంబంలోని వారందరికీ కరోనా సోకడం గమనార్హం. కరోనా పాజిటివ్ సోకిన బాలుడిని ఎర్నాకులం మెడికల్ కాలేజీలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి నిపుణులైన వైద్య బృందం పరిశీలిస్తోందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.